Jagathguru Bhodalu Vol-8        Chapters        Last Page

భారతావనిలో వేదాధ్యయనం :
కంచి కామకోటిపీఠం అనన్యకృషి
ఎస్‌.అన్నాదురై అయ్యంగార్‌?

ప్రపంచంలోని సర్వధర్మములకు మూలం వేదం, భారతదేశంలో వివిధ ప్రాంతాలలో గల హిందువులు, వారి ఆహారం, వేష భాషలు విభిన్న మైనప్పటికి ఐకమత్యంతో సౌభ్రాతృత్వంతో ఇరుగుపొరుగు వారివలె ఇంతకాలం మెలుగుతూ వచ్చారు. కాశ్మీరునుండి కన్యాకుమారివరకు గల భారతీయులను ఐక్యంచేసే ఒక అనుసంధాన సాధనం ఉండడమే దానికి కారణం. అవి మహాపండితులచే శ్లాఘింపబడిన అతి జవిత్ర భారతీయ విజ్ఞాన నిక్షిప్తాలైన వేదములు.

ప్రాచీనకాలంలో లోకానికి, ఐహిక, ఆముష్మిక సంపదల నొనగూర్చే దివ్యమంత్రాక్షర సంయుక్తమైన వేదాలకు రెండు ప్రయోజనాలు ఉన్నట్లు సుస్పష్ట మవుతున్నది.

1. పారాయణ-మంత్రార్థాలను గ్రహించినా, గ్రహించకపోయినా నిత్యపారాయణం చేసే వ్యక్తికి, ప్రజాబాహుళ్యానికి శ్రేయోదాయకము, (ఆ అర్థాలను గ్రహిస్తే వాటికి ఎంతో ప్రభావం వుంటుంది)

8-24

2. యజ్ఞక్రతువులలో వేదమంత్ర వినియోగం-ఎవరైతే పరిపూర్ణంగా ఆత్మార్పణ గావించుకొని కఠినమైన వైదిక నియమాలతో ఈ క్రతువులను పరమేశ్వర ప్రీత్యర్థంచేయడం జరుగుతుందో, వారికి సమస్త శాంతి, సౌభాగ్యాలు ఒనకూరుతాయి.

మనపూర్వమహరుల వంశస్థులు తమ విధ్యుక్తధర్మంగా భావించే వేదమంత్రాలకు ఈ విధమైన ప్రభావయుత ప్రయోజనాలను ఆపాదించే బాధ్యతను స్వీకరించారు. 5000 సంవత్సరాలకు పూర్వం వసించిన భగవానుడగు వేదవ్యాసుడు వేదసంరక్షణ బాధ్యత వారికి అప్పగించాడు.

సాంప్రదాయకంగా యోచిస్తే, పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతు అను నలుగురు ఋషులు ప్రప్రధమ వేదరక్షకులు, ఇవే జనసామ్యానికి తెలిసిన ఋక్‌, యజుర్‌, సామ, అధర్వణ వేదాలు. ఈ ఋషులు ఈ శాఖలను గూర్చి తమ శిష్యులకు బోధించారు.

అప్పుడు వేదాలలో 1,131 శాఖలు గలవని, 21 శాఖలు ఋగ్వేదంలోను, 101 శాఖలు యజుర్వేదంలోనూ; 1000 శాఖలు సామవేదంలోనూ; 9 శాఖలు అధర్వణ వేదంలోను గలవని విష్ణుపురాణం వెల్లడి చేస్తున్నది. దీనిని బట్టి ఆనాడు ఎంతమంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నదీ విశదమవుతుంది. 19వ శతాబ్దంలో తంజావూరు జిల్లాలోని తిరువాయూరులోని ముత్తుగణపతిగళ్‌ అను పండితుని వద్ద 200-300 మంది విద్యార్థులు వుండేవారు. రానురాను ఈ సంఖ్య తగ్గజొచ్చింది.

గత 100 ఏళ్ళలో వైదిక విద్యకాని. విద్యవలనే బ్రతుకు తెరువు లభ్యమవుతుందనే భావన ప్రజలలో వ్యాపించడంతో వైదిక సంప్రదాయం క్రమక్రమంగా అంతరించి పోతున్నది. ఈ కారణంగా నేడు మనకు 10 శాఖలు (ఋక్‌ 1, యజుర్‌ 4, సామ 3, అధర్వణ 2) మాత్రమే మిగిలాయి. వేదపారాయణకు సంబంధించిన నిబంధనలుగల గ్రంథాలను 'ప్రాతిశాఖ్యలు' అని అంటారు. వీటివలన వైదిక మంత్రశక్తి సంరక్షిత మవుతుంది. నేడు వీటిలో ఒక ప్రాతిశాఖ్యలో విజ్ఞానాన్ని కలిగియున్న వ్యక్తులుకూడా చాలా అరుదుగా వున్నారు:

మహత్తరమైన ఈ వైదిక సంప్రదాయం అంతరించకుండా, 1942 నుండి, కంచికామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీశంకరాచార్యులవారు ఎంతో కృషి చేస్తున్నారు. దీనికై వారు అనేక సంస్థలను రూపొందిస్తున్నారు. ఇవి ఈ సమస్యను వివిధ స్థాయిలలో పరిష్కరిస్తాయి. వారు చేసిన కృషికి నిదర్శనాలు -

1. మద్రాసులోని వేదధర్మశాస్త్ర పరిపాలనాసభ అధ్వర్యాన భారతదేశంలో అనేకస్థానాల లోను, ముఖ్యంగా మద్రాసురాష్ట్రంలోని దక్షిణ ప్రాంతాలలో సమ్మేళనాలు ఏర్పాటు అయినవి. పశ్చిమ రాజ్యాల నాగరికతచే ప్రభావితులైన భారతీయులు నవీన పద్ధతులలో వైదిక జీవనవిధానాన్ని అనుసరించే విధంగా ఇది రూపొందించడం జరిగింది.

గృహస్థులైన వారికి కొన్ని ముఖ్యమైన హైందవ వ్యవస్థలందు, నియమాలందు ఉత్సాహము కలిగించి, ఆరమతం పాటించే వారియెడల, వైదిక కర్మల నాచరించే వారి యెడల ఆగృహస్థులకు భక్తి ప్రపత్తులు కలుగజేయడం వీరి ముఖ్యోద్దేశం.

2. 1955లో భారతదేశంలోని లక్షణవిద్వాన్‌లకు ధనం కనక, బహుమానాదుల నిచ్చి సన్మానించారు.

1945లో స్థాపితమైన 'కలలై బృందావన వరమగురు వేదవిద్యానిధి', ఆదాయం సహాయంతో వేదపండితులకు జీవితాంతము బహుమానాలు ఇవ్వడం జరిగింది.

3. 1954లో స్థాపితమైన కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతీస్వామి షష్ట్యబ్ద పూర్తి నిధివలన వచ్చే ఆదాయం (రు.30,000) 5 ఏళ్లవరకు వేదభ్యాసం నేర్చుకొనడానికి ఉద్దేశితమైనది. వేదభాష్యాలలో పరీక్షలు జరిగాయి. విద్యార్థులకు సంవత్సరానికి రు. 200 నుండి 300 వరకు సత్కారం ఇవ్వడం జరిగింది; ఉచితంగా గ్రంథాలుకూడా సరఫరా చేయబడ్డాయి. ఇదిగాక నెలకు రు. 35.లు వారికి లభ్యమవుతాయి. పరీక్షలో ఉత్తీర్ణుడయిన ప్రతివిద్యార్థికి రు.3000 ల నుండి రు.7000 ల వరకు ఇస్తూ 'భాష్యరత్న', 'భాష్యమణి'అనే బిరుదులు కూడా ప్రదానం చేశారు. వేదభాష్యం నేర్చుకొనడానికి 7 సంవత్సరాలు అవసరం, పరీక్షకు హాజరు కావడానికి ఉచితబోధకూడా ఏర్పాటు చేశారు. 1961-66 ల మధ్య 27 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనారు. మరి వారికి రు. 5000 ల నుండి రు. 7000 లు గ్రాంట్లు ఇచ్చారు. ఇంతవరకు ఇచ్చిన గ్రాంట్లు మొత్తం రు. 1,47,000.

4. పాఠశాలల్లోగాని, వేదరక్షణనిధి పథకం క్రిందగాని 'ఘన' వరకు వేదాధ్యయన శిక్షణ పూర్తిచేసి విద్యార్థులకు మరింత ప్రోత్సాహాన్నిచ్చి, వారిసంఖ్య తగ్గకుండ అతి ముఖ్యమైన చర్య తీసుకోవడం జరిగింది. 'వికృతుల'ను వదలివేసి ఒక శాఖను పూర్తిచేసిన విద్యార్థికి రు. 1200 లు; 'క్రమం' వరకు పూర్తిచేసినవారికి మరో రు.1200 లు ఇవ్వడానికి ఈనిధి ఏర్పాటుచేసింది.

ఈ పద్ధతిపై 'క్రమం' పూర్తిచేసిన విద్యార్థికి శిక్షణ పూర్తి అయిన తర్వాత బహుమాన రూపేణా రు.2000 లు లభ్యమైనది. గ్రాంట్లు ఇవ్వవలసిందని పాఠశాలలకు విజ్ఞప్తి చేశారు. 'క్రమం' పూర్తిచేసిన విద్యార్థికి రు. 4000 లు, లభ్యమవుతుంది. 'ఘన', లక్షణాలకు అదనంగా రు.1000 లు బహుమానం ఏర్పాటు అయింది. 10 ఏళ్లు అధ్యయనం తర్వాత ఒక 'ఘనపాఠి' రు.5000 లు పెట్టుబడితో సామాన్య జీవితాన్ని ఆరంభించడానికి వీలువుంటుంది.

గురుకుల పద్ధతిలో అధ్యయనం నేర్చుకొన్న ఏవిద్యార్థికైనా గ్రాంట్లకు రెట్టింపు అనగా రు. 4000 నుండి, రు.10090 లు వరకు లభ్యమవుతుంది.

సంస్కృతభాష, తర్కం, మీమాంస, వ్యాకరణం, శాస్త్రాలు, నిరుక్తి - వీటిలో జ్ఞానాన్ని సముపార్జించిన విద్యార్థిషష్ట్యబ్దపూర్తినిధి పథకం క్రింద జరుపబడే వేద్యభాష్య పరీక్షలక హాజరు కావచ్చును.

వీరికి ఉపకారవేతన సౌకర్యం వుంటుంది. పూర్తి అయిన తర్వాత రు.3000 ల నుండి, రు. 7000 ల వరకు గ్రాంట్లు లభ్యమవుతాయి.

ఈ విధంగా వేదములందు కుతూహలం గల విద్యార్థుల ఆర్థికపరిస్థితి అభివృద్ధి చేయడం జరిగింది. ఏవిధమైన వ్యయం లేకుండా ఈ వేదాధ్యయనం గావించిన విద్యార్థికి సామాన్య జీవితం గడపడానికి అవసరమైన ధనాన్ని (రు.5000-12000) అతను పొందవచ్చును. 10-17 ఏళ్ళలో అతడు వేదభాష్యపండితుడవుతాడు.

పుత్రునికి తండ్రిగురువై గురుకుల పద్ధతిలో అధ్యయనం బోధించడం ప్రాచీన ఆరమత సంప్రదాయం. దీనిని ప్రత్యేక పద్ధతిలో స్వాములవారు మలచారు. నియమ అధ్యయన విద్యార్థి రక్షణపథకాన్ని ఆయన ఏర్పాటు చేశారు దీనిక్రింద, 10 ఏళ్ల పాటు తండ్రివద్ద గురుకుల పద్ధతిలో అధ్యయనం పూర్తిచేసిన విద్యార్థికి (ఇది గాకుండా ఈ పథకం క్రింద జరిగే పరీక్షకు హాజరవడానికి వేదాంగాలలోని జ్ఞానం అతనికి వుండాలి) 10 ఏళ్ళకు రు.10,000 లు మాత్రమే గాకుండా, అతని జీవితానికి సరిపడాఇవ్వబడిన పెట్టుబడి రు.10,000 లపై వచ్చే ఆదాయం కూడా లభ్య మవుతుంది. ఈ సౌకర్యం అతను మరణించిన తర్వాత అతని సతికి, వంశానికి వుంటుంది. లేదా తగిన అర్హతలు గల అతని ప్రతినిధికి ఈ సౌకర్యం వుంటుంది. అటువంటి 12 కుటుంబాలకు ఈ సౌకర్యాలు కల్పించబడుతున్నాయి. ఇంకా మరికొన్ని కుటుంబాలకు ఈ సౌకర్యాలు కల్పించడానికి కృషి జరుగుచున్నది.

ఈ పథకం 1959లో, ప్రారంభ##మైనది. అప్పుడు 113 మంది విద్యార్థులు, 18 మంది గురువులు గల 17 పాఠశాలలకు రు.8590-94 లు, 1960-61 లలో, 201 మంది విద్యార్థులు, 41 మంది గురువులుగల 31 పాఠశాలలకు రు.23,578 198లు, సంభావనలు ఇవ్వడం జరిగింది. 1961-62 లలో 41 పాఠశాలలకు రు.25,805-72 లు, ఇవ్వడం జరిగింది. 1965 వరకు రు.99.603-99 లు గ్రాంట్లు ఇవ్వబడ్డాయి.

రానురాను విద్యార్థులు చాలామంది చేరుతున్నారు. అఖిలభారత స్థాయిలో కూడా స్వాముల వారు వేదాల పునరుద్ధరణకై చర్యలు తీసుకొన్నారు.

1962, అక్టోబర్‌లో ప్రప్రథమ అఖిలభారత వైదిక విద్యార్థుల సమావేశాన్ని న్యూఢిల్లీలో ఆయన ఏర్పాటు చేశారు. భారతదేశంలోని పలుచోట్లనుండి విద్యార్థులను, గురువులను ఒకచోట కలుసుకునేటట్టు చేయడానికి తగు చర్యలు తీసుకొన్నారు.

వింధ్యపర్వతాలకు దక్షిణంగా గల ప్రాంతాలలోనే గురుముఖంగా లభ్యమయ్యే అధ్యయనం ఇంకా కొనసాగుతున్నట్లు వీటి దర్యాప్తుకై ఏర్పడిన సంఘాలు తెలియజేశాయి. పశ్చిమ బెంగాల్‌లో గల మూడు కేంద్రాలలో 20 మంది విద్యార్థులు మాత్రమే వేదాలను అభ్యసిస్తున్నారని తేలింది. మద్రాసులో 50, ఆంధ్రలో 11, మహారాష్ట్రలో 10, మైసూరులో 4, కేరళలో 1, ఉత్కళలో 1, ఉత్తర ప్రదేశ్‌లో 1, పాఠశాలలు ఉన్నాయి. మొత్తం దేశంలో 860 మంది విద్యార్థులు ఉన్నారు.

అధర్వణ వేదంలోని శౌనకశాఖలో ప్రస్తుతం ఒక విద్యార్థి ఉన్నాడు. యజుర్వేదపండితులు ముగ్గురు, అధర్వణవేద (పిప్పాలద) పండితులు, 9 మంది, జైమిని సామవేద పండితులు కొద్దిగాను వున్నారు.

దేశంలో వివిధవేదశాఖలు ఎక్కడెక్కడ వున్నాయో పరిశీలించడం జరిగింది.

బెంగాల్‌లో గౌతమసామం, ఉత్కళలో పిప్పలాద అధర్వణం, ఉత్తరప్రదేశ్‌లో మధ్యందిన, కణ్ణశాఖలు, ఆంధ్రమైసూర్‌లలో తైత్తిరీయ యజుర్వేద శాఖలు, మహారాష్ట్రలో ఋగ్వేదం, మలబారులో జైమినిసామం, నర్మద కిరుప్రక్కలా అధర్వణ వేదం ఇంకా ప్రభావం కల్గి ఉన్నా యని తేలింది.

గుజరాత్‌, నాసిక్‌, శ్రీరంగం, కలకత్తాలలో పాఠశాలలు ప్రారంభించి శౌనక అధర్వణ, మైత్రాయణ యజుర్వేదం, జైమినిసామం, గౌతమసామాలను సంరక్షించడానికి చర్యలు తీసుకున్నారు.

కేంద్ర విద్యామంత్రిత్వశాఖ సహకారంతో శ్రీ స్వాములవారు విద్యార్థులకు, గురువులకు ఈ సంస్థలలో ధనసహాయ్యం కూడా ఏర్పాటు చేశారు. ఇదంతా మొదటి వైదిక విద్యార్థి సమావేశం జరిగిన పిమ్మట జరిగినది.

8-25

ఋగ్వేదంలోని బాశ్కల శాఖవలె సామశాఖగూడా వున్నట్లు పరిశీలన వలన తేలింది.

వేదపండితులను సన్మానించే ఉద్దేశంతో వేదాధ్యయన పరులకు శుభాశీస్సులు భారత ప్రజలకు అందజేయాలనే దృష్టితోను ద్వితీయవైదిక సమావేశాన్ని శ్రీ స్వాములవారు 1965, ఫిబ్రవరి, 24 నుండి 28 వరకు మద్రాసులోని శివవిష్ణు ఆలయాలలో ఏర్పాటు చేశారు.

దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి, 550 మంది వేదపండితులు దీనికి హాజరైనారు.

1966లో, స్వాములవారు తిరుపతి దేవస్థానంవారిచే తృతీయ అఖిలభారత వైదిక సమావేశాన్ని ఏర్పాటు చేయించారు. దీనిలో అనేకమంది పండితులు, భాష్యకారులు ఉత్సాహంతో పాల్గొన్నారు.

ఈ సమ్మేళనాలు వైదికసభలలో భాగంగా పిప్పాలద శాఖకు పాఠశాలలు స్థాపించడానికి చర్యలు తీసుకున్నారు. వేదపండితులకు సంభావనలు పంపారు. మద్రాసులో అధ్యయన తరగతులు ప్రారంభించారు.

బెంగాల్‌లోని గౌతమ సామవేదశాఖను కంఠోపాఠం చేసినవారు లేరు. అందువలన శ్రీస్వాములవారు, 1964 లో కలకత్తాలో బెంగాలీ బాలురకై వేదపాఠశాలలు నెలకొల్పారు. ఇప్పుడు, 19 మంది విద్యార్థులు అధ్యయనం నేర్చుకుంటున్నారు. 1965లో కామకోటిపీఠం కలకత్తాలో ఒక వేదభవనం నెలకొల్పింది. ఇక్కడ ఋగ్వేదం, యజుర్వేదం సామవేదం బోధిస్తారు.

జమీందారీల రద్దుతో వేదపండితులను ధన, కనక వస్తువులతో సన్మానించే ఆచారం కూడా అంతరించి పోయింది.

శ్రీ స్వాములవారు తిరిగి ఈ ఆచారాన్ని వెలుగులోకి తీసుకొని వచ్చారు. కాళహస్తిలో ఆయన, 1966లో ఒక విద్యుత్‌ సదస్సు ఏర్పాటు చేశారు. ఇందులో 57 మంది వేదపాఠకులకు శాస్త్రపారంగతులకు బహుమానా లిచ్చి సత్కరించారు.

ఈ మహత్కార్యాన్ని శాశ్వతంగా కొనసాగించడానికి తిరుపతి దేవస్థానంవారు సాలీనా లక్షరూపాయల వ్యయంతో కూడిన ఒక పథకాన్ని రూపొందించడానికి, నిశ్చయించారు.

ఈ పథకం క్రింద సంభావనలు తదితర బహూకృతుల నివ్వడానికి ప్రతిఏడాది సదస్సులు ఏర్పాటు అవుతాయి.

1. ఋక్‌, యజుర్‌, సామవేదాలలో క్రమాంతం, రహస్యాంతములకు, ఇతర శాఖలలోని సంహితలకు (గృహ్యసూత్రాలతో సహా) రు.300 లు, శాలువలు.

2. ఋక్‌, యజుర్‌, సామవేదాలలో గణాంతం, పదాంతములకు, ఇతరశాఖలలో (ప్రాతిశాఖ్యలతోపాటు) క్రమాంతమునకు రు.500, 2 శాలువలు.

3. పైవాటిలో ఉత్తీర్ణులైన వ్యక్తులకు జీవితాంతం సాలీన సంభావనలు ఇవ్వబడతాయి.

మఠాలు, ఇతరసంస్థలలో తాత్కాలికంగా అధ్యయనాలకు శ్రీస్వాములవారు అవకాశాలు కల్పించారు. మద్రాస్‌, ఆంధ్రప్రదేశ్‌, మైసూర్‌లలో గల వేద విద్యార్థులకు పండితులకు ఉపకార వేతనాలు, బహుమతులు కూడా ఏర్పాటు చేశారు.

వేద్యాధయనం, వేదపఠనం - వీటిని సంరక్షిస్తూ ప్రజలలో వాటిపై ప్రోత్సాహం కలిగిస్తూ యావద్భారతావనిని నూతనోత్తేజంతో పునరుజ్జీవింపజేసి, విదేశ నాగరికతా ప్రభావంచేత మనం కోల్పయిన సనాతన హైందవ సంస్కృతి ఆచంద్రార్కం శోభాయమానంగా దివ్యవిజ్ఞాన దీప్తులను ప్రసరింపజేస్తూ చిరంతనమైన ఈ పరమపవిత్ర ఆర్యభూమిపై పునర్వికాసం చెందడానకి తమ ఆధ్యాత్మిక జీవన సంపత్తిని అనుక్షణం ధారపోస్తూ, వేదములు అ పౌరుషేయములే గాదు, అవి అన్ని యుగాలకు చెందినవి. ఆసందేశాలు, అతి ప్రాచీనాలే కాదు, అతి నవ్యమూ, నవనవోన్మేషములని నిరూపించి జీవితాన్ని చరితార్థం చేసుకొన్న కంచి కామకోటి పీఠాధిపతులకు కృతజ్ఞతా పూర్వక నమోవాక్కులను అందజేసి, ఆ మహోజ్వల ఔన్నత్యం ముందు నమ్రశిరస్కులు కానివారు ఎవరూ కానరారు.


Jagathguru Bhodalu Vol-8        Chapters        Last Page